
K24 న్యూస్ తెలుగు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ Garima Agrawal ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు సన్న వడ్ల విత్తనాలు పంపిణీ చేశారు.
రైతులు పంట మార్పిడిలో భాగంగా సన్న వడ్లు సాగు చేయాలని, సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం వినియోగం పెరుగుతున్నందున రైతులు సన్న రకాల వరి సాగుపై దృష్టి పెట్టాలని తెలిపారు.
లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రసీదులు భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే ఆయిల్ పామ్ సాగు, సహజ వ్యవసాయం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

