
తెలుగు కే న్యూస్ సింగరేణిలో 38 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో సేవలందించి, జనరల్ మేనేజర్ (అండర్గ్రౌండ్ మైన్స్)గా విధులు నిర్వహించి ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న శ్రీ వై. రఘురామిరెడ్డిని ఎస్టిపిపి అధికారులు ఘనంగా సన్మానించారు. ఎస్టిపిపి పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఈడీ సిహెచ్. చిరంజీవి మాట్లాడుతూ రఘురామిరెడ్డి అందించిన సేవలను కొనియాడి, వారి శేష జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. సింగరేణిలో SAP ఆన్లైన్ కంప్యూటరీకరణ అమలులో ఆయన విశేష కృషి చేశారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జీఎం మదన్ మోహన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


