
నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, జూన్ 30, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
*పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు*, ఇటీవల ట్రాక్టర్లకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, డిచ్పల్లి సీఐ కె. వినోద్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున జక్రాన్పల్లి పోలీసులు జక్రాన్పల్లి మండలానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లకు ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ *కె. వినోద్*, ఎస్ఐ *జి. మహేష్ , ట్రాక్టర్ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా *తప్పు దిశలో (Wrong Direction) వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాక్టర్లు మరియు ట్రాలీలపై ప్రయాణికులను ఎక్కించవద్దని, అతివేగంగా వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని* సూచించారు.
అలాగే రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు స్పష్టంగా కనిపించేలా వాటిపై *రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను* అతికించారు. ప్రతి ట్రాక్టర్కు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ తదితర అన్ని సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని పోలీసులు హెచ్చరించారు.


