
హైదరాబాద్,K24 న్యూస్ తెలుగు హిమాయత్నగర్:
ఎన్సీఆర్డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ మహిళా సభ నిర్వహించి తమ శక్తిని ప్రదర్శిస్తామని తెలిపారు. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని, మహిళా బిల్లు అమలు చేయని పార్టీలకు ఓట్లు వేయొద్దనే ఉద్యమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ మహిళలకు కనీసం 33 శాతం, అర్హత ఉన్నచోట 50 శాతం వరకు టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా

