
హైదరాబాద్, జూన్ 25 (తెలుగు కే న్యూస్): గాంధీభవన్లో నిర్వహించిన ఎస్టీ రిజర్వేషన్ల స్వర్ణోత్సవ బస్సు యాత్ర కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ, గిరిజనుల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధిలో ఎస్టీ రిజర్వేషన్లు కీలక పాత్ర పోషించాయని అన్నారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


