నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి

 

కొండమల్లేపల్లి, k24 న్యూస్ తెలుగు జూన్ 22:  మండలంలో ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. సోమవారం మండల విద్యాశాఖ అధికారి రామావత్ నాగేశ్వరరావును కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు రామావత్ సేవ నాయక్ మాట్లాడుతూ, మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్న ప్రైవేట్ పాఠశాలలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే అనుమతులు లేకుండా కొనసాగుతున్న శిక్షణ కేంద్రాలను వెంటనే మూసివేయాలని, పాఠశాలల విద్యార్థుల రవాణాకు ఉపయోగిస్తున్న ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల పేరుతో విద్యార్థులపై బలవంతంగా పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేయించే విధానాన్ని అరికట్టాలని కోరారు.
ప్రతి విద్యార్థి శారీరక, మానసిక వికాసం కోసం ప్రైవేట్ పాఠశాలల్లో క్రీడా పాఠాలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గుండాల రాజేష్ యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.