బీసీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, K24 న్యూస్: తెలంగాణలోని బీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకు బీసీల డిమాండ్లపై వినతిపత్రం సమర్పించారు. విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి రుణాలు, రైతులకు సబ్సిడీలు, సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని 132 బీసీ కులాలకు సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్‌తో పాటు వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :