మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కుప్పంలో ఘనంగా జరుపుకున్న కార్యకర్తలు!

కె24న్యూస్ తెలుగు జూలై 07. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, వీకోట ప్రాంతాల్లో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అంబెడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, పేదలకు అన్నదానం, పండ్ల పంపిణీ చేశారు. వెంకటేష్ మాదిగ, పాపన్న,MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, గోవిందప్ప, జయప్ప, విజయ్ కుమార్, రియాజ్, నాసిర్, మద్దిరాల సుబ్రహ్మణ్యం, రాము, రాజేంద్ర, మురుగేష్, సంపంగి వంటి పలువురు నాయకులు పాల్గొని ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న పోరాటం, దళిత సమాజ ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తం చేసిందని ఈ సందర్భంగా నేతలు ఉద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి :

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లోని రాగి కాయిల్స్ ను దొంగతనం చేస్తున్న ఆరుగురు నిందితులను మరియు వారి వద్ద నుండి దొంగతనం చేసేలా ప్రోత్సహించి దొంగలించిన రాగి (కాపర్ కాయిల్స్) ను కొనుగోలు చేసిన నిందితుల అరెస్ట్ : పోలీస్ కమీషనర్ వెల్లడి*

తాజా వార్తలు చదవండి :

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లోని రాగి కాయిల్స్ ను దొంగతనం చేస్తున్న ఆరుగురు నిందితులను మరియు వారి వద్ద నుండి దొంగతనం చేసేలా ప్రోత్సహించి దొంగలించిన రాగి (కాపర్ కాయిల్స్) ను కొనుగోలు చేసిన నిందితుల అరెస్ట్ : పోలీస్ కమీషనర్ వెల్లడి*