కాణిపాకంలో బోడె రామచంద్ర యాదవ్ సత్యప్రమాణం

తెలుగు కే న్యూస్ కాణిపాకం, జూన్ 25: తాను ఏ రాజకీయ నాయకుడికి లేదా ఏ పార్టీకి బినామీని కాదని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సాక్షిగా సత్యప్రమాణం చేస్తూ, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే తమ పార్టీ లక్ష్యమని, బీసీవై పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీవై పార్టీని తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :