గాల పేరుతో వసూళ్లు చేస్తే కఠిన చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలుగు K24 న్యూస్:
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా పరిగణించారు. బాధ్యులెవరైనా ఉపేక్షించబోమని, సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిరుద్యోగ యువతకు మంత్రి సూచించారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :