కుప్పం అర్బన్ నూతనంగా భాద్యతలు స్వీకరించిన సీఐని కలిసిన MRPS, బహుజన సేన నాయకులు

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 22. కుప్పం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ హాషంను MRPS మరియు బహుజన సేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అర్బన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పేదలు, దళితులకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని వారు కోరారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ.ప్రకాష్, కుప్పం మండల అధ్యక్షులు కే.రాజేష్, బహుజన సేన నియోజకవర్గ ఇంచార్జీ మహేష్, దళిత ఉద్యమ సీనియర్ నాయకులు బాలచంద్రబాబు, సతీష్, బోధగుట్టపల్లి బాబు, దేవరాజ్,తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :