శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 22. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో శనివారం అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వెంకటాపురం మీనాక్షిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు హేమలత, నరేష్ లు అన్నదాన వితరణ చేశారు.ఈ సందర్బంగా కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహించే ధ్యాన మహాయజ్ఞం 23వ తేది నుండి 29వ తేది వరకు జరిగే ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న మహాయజ్ఞ కార్యక్రమానికి అందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భానుమతి, కామాక్షిరెడ్డి, బండి పట్టాభిరెడ్డి, రఘునాథరెడ్డి, మాధవిలత, కె బాబు రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొని అనాథలకు భోజనం వడ్డించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :